యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హైదరాబాదు నుండి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు తీసుకువచ్చే జ్యోతి రథయాత్రను యాదగిరిపల్లి వరకు కొనసాగించాలని యాదగిరిగుట్ట ఆలయ డిఈఓ దొర్బల భాస్కర్ శర్మకు యాదగిరి పల్లి ప్రజలు వినతిపత్రం సమర్పించారు. వారు సానుకూలంగా స్పందించి యాదగిరిపల్లికి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరిపల్లి స్థానికులు కోల వెంకటేష్, పాపట్ల నరహరి, చిత్తర్ల బాలయ్య, బూడిద స్వామిదాసరి బాల గురవయ్య, మిట్ట లింగం, మిట్ట శివ తదితరులు పాల్గొన్నారు.
