నూతన లిఫ్ట్ నిర్మాణాలతో వేల ఎకరాలు సాగులోకి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ/మేళ్ళచెరువు (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నూతన ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని రైతులకు ఖరీఫ్ రబీ రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు నీరు అందిస్తానని రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల సందర్భముగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులతో కలిసి కార్య నిర్వహణాధికారి శంభిరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య కమిటీసభ్యులు గ్రామ పెద్దలతో కలిసి మంత్రి ఉత్తమ్ కు పూర్ణ కుంభ స్వాగతము పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరము స్వామి వారి శేషవస్త్రముతో సత్కరించి ఆలయ అర్చకులు కొంకపాక ధనుంజయ శర్మ, గ్రామ పురోహితులు కొంకపాక రాధాకృష్ణ మూర్తి, యాతవకీళ్ల భానుప్రకాశ్ శర్మలు తీర్ధ ప్రసాదములు అందజేసినారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఎద్దుల పెందెములు, కబడ్డీ పోటీలను మంత్రి ఉత్తమ్ ప్రారంభించి మాట్లాడుతూ… 1994 నుండి మహా శివరాత్రి బ్రహ్మోత్సవములలో పాల్గొంటున్నానని దేవాలయ అభివృద్ధికి అన్ని వేళల సహకరిస్తానని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్, పారిశ్రామిక వేత్త పోశం నర్సిరెడ్డి, గ్రామ పెద్దలు కాకునూరి భాస్కర్ రెడ్డి, శాగంరెడ్డి గోవిందరెడ్డి, కొట్టేసైదేశ్వర్ రావు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవములలో అన్నదానం
శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భముగా 4వ రోజున ప్రాతఃకాలమున గణపతి పూజ, పుణ్యావచనము స్వామి వారికి అభిషేక పూజలు, హోమములు నిర్వహించినారు. తదుపరి మహానివేదన నీరాజన మంత్రపుష్పములు, భక్తులకు తీర్ధ ప్రసాద వినియోగము చేసారు.

