విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ (ఏపీ) ప్రతినిధులు మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డినీ మర్యాదపూ ర్వకంగా కలిశారు.ఈసంద ర్భంగా బస్సులపై విధిస్తు న్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని కోరుతూ వినతి పత్రాన్ని మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి అందజేశారు.పన్నుల తగ్గింపుతో బస్సు ల రిజిస్ట్రేషన్లు ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రావడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరు గుతుందని ప్రతినిధులు వివరించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి, అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్.సంబిరెడ్డి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
