Breaking News

50వ డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిది.

డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా.

కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ పట్టణం 50 డివిజన్ ప్రజలు తనపై విశ్వాసం, నమ్మకం తో మున్సిపల్ ఎన్నికల్లో అందించిన విజయం జీవితంలో మర్చిపోలేనిదని, డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని , డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషిచేసి ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తానని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు అన్నారు. ఎన్నికల్లో విజయాన్ని అందించిన 50వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈరోజు డివిజన్ లొ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రముఖులు బోయిన్పల్లి ప్రవీణ్ రావును అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ 50 డివిజన్ ప్రజలు ఎన్నికల్లో తనపై చూపిన ప్రేమ , అభిమానం స్పష్టంగా ఎన్నికల్లో కనిపించిందని, ప్రజలు ఆశీర్వదిస్తేనే కార్పొరేటర్ గా విజయం సాధించానని తెలిపారు. డివిజన్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *