యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన ఈరోజు దేవతాహ్వానం, ధ్వజారోహణం చూడముచ్చటగా సాగాయి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తివచనంతో ప్రారంభమై, రెండవ రోజు దేవతాహ్వానం, ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణం. ద్వజస్తంభ అధిపతి అయిన గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి, వేదమంత్రాలతో ఆవాహన చేశారు.
