యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి కుటుంబం సాంప్రదాయబద్ధంగా గత 15 ఏళ్లుగా స్వామివారికి, అమ్మవారికి,ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు.. అందులో భాగంగా ఈనెల 25 న జరిగే తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు,పట్టువస్త్రాలు శుక్రవారం హైదరాబాద్ నివాసంలో అందజేశారు.
