Breaking News

శుక్రవారం సభ ద్వారా ప్రజారోగ్య పర్యవేక్షణ: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(నేటి తెలుగు పత్రిక) : చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ తల్లీపిల్లల ఆరోగ్యానికి, పోషణకు శుక్రవారం సభ ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. పిల్లల ఆరోగ్యం పై ఎలాంటి సందేహాలు ఉన్నా శుక్రవారం సభలో ప్రభుత్వ వైద్యునికి తెలియజేయాలన్నారు. ప్రతినెలా అంగన్వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గ్రామాల వారీగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక తెప్పించుకొని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.బరువు తక్కువగా ఉన్న శిశువుల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, అలాంటి పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అతిగా బరువు తక్కువ ఉన్న చిన్నారులను ఎన్ఆర్సి లో చికిత్స అందించి సాధారణ బరువు పెరిగేలా చూస్తున్నామని తెలిపారు.శుక్రవారం సభలో 95 శాతం మంది మహిళలు ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారని, 245 మంది మహిళలకు రెండవ దఫా స్క్రీనింగ్ పూర్తయిందని, ఇది మంచి విషయమని అన్నారు. శుక్రవారం సభలో ఏర్పాటు చేసే హెల్త్ క్యాంపులను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళా సర్పంచులు శుక్రవారం సభ నిర్వాహణకు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యేంతవరకు పిల్లలను కచ్చితంగా ప్రతిరోజు బడికి, ప్రత్యేక తరగతులకు పంపించాలని కోరారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, శిశువులకు అన్నప్రాసన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య అధికారి వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పురం మాధవి, ఉపసర్పంచ్ వేముల శేఖర్, సిడిపిఓ నర్సింగారాణి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం.

తిరుమలలో వైద్య సేవల అవకాశం.. వసతి, భోజనం, దర్శనం సౌకర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *