Breaking News

ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు.

విజయవాడ. ఫిబ్రవరి 21 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమింపబడిన ఎం.ఎస్.బేగుని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం విజయవాడ భావానిపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత అధికారికంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ సభకు తొలిసారిగా హాజర వుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని బేగ్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శాలువాతో సత్కరించి, పుస్తకాలను జ్ఞాపికలుగా అందించారు. ఈ సందర్భంగా రచయితలకు గ్రంథాలయాలకు వున్న అనుబంధాన్ని ఆయనకు వివరించారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ గ్రంథాలయల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వంలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎన్నో వసతులతో ఉన్నతంగా సారా వేగంగా నిర్మాణం జరగబోతుంన్నారు. ఈ లైబ్రరీలో పుస్త కాలను డిజిటలైజ్ చేసే గొప్ప సౌకర్యం వుండబో తుందన్నారు. రచయిత లకూ గ్రంథాలయాలకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సామర స్యభావంతో అభివృద్ధి దిశగా అడుగులేద్దామని అన్నారు. అందుకు రచయితల సంఘాలు జర్నలిస్టు సంఘాలు తోడ్పాటు నందించాలన్నారు. ఎం.ఎస్.బేగ్ ను కలిసిన వారిలో నవ్యాంధ్ర రచయితల సంఘం జనరల్ సెక్రెటరీ కలిమిశ్రీ, అభివృద్ధి కమిటీ కన్వీనర్ యేమినేని వెంకట రమణ, కోశాధికారి చొప్పా రాఘ వేంద్రశేఖర్, జిల్లా నాయకులు విష్ణు భొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

మన నగరం పరిశుభ్రత మనందరి బాధ్యత…!

ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాలపై ఉగ్ర కుట్ర అనుమానం.. భద్రత కట్టుదిట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *