Breaking News

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో వైద్య శాల లో వసతుల కల్పనకు కృషి.

రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్‌తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.

కోదాడ ,ఫిబ్రవరి 21(నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు కు ఘన సన్మానం.పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన శ్రీమతి ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి ,ఉత్తం సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ఉత్తమ సేవలందించి ఉత్తమ సేవలందించి పేరు సాధించాలన్నారు. కాగా మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లు తోట జ్యోతి శ్రీనివాస్, జిల్లే పెల్లి నాగేశ్వరరావు లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, సిబ్బంది, మహిళా నాయకులు పబ్బ గీత తదితరులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో రాజ్యాంగ నైతికతపై సదస్సు.. కీలకోపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *