నేటి తెలుగు పత్రిక: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను ఈ ఏడాది కూడా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.పీజీఈసెట్ ర్యాంక్ ఆధారంగా 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హతలు:
సంబంధిత కోర్సు ప్రకారం బీఈ, బీటెక్ లేదా బీఫార్మసీ ఉత్తీర్ణత అవసరం. ఏరోస్పేస్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, ఫార్మసీ తదితర విభాగాల్లో ప్రవేశాలు ఉంటాయి.
దరఖాస్తు వివరాలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 27, 2026
- ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ: మే 06, 2026
- రిజిస్ట్రేషన్ ఫీజు:
- జనరల్ అభ్యర్థులు: రూ.1100
- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: రూ.600
ఆలస్య రుసుములతో తేదీలు:
- రూ.250తో: మే 09
- రూ.1,000తో: మే 12
- రూ.2,500తో: మే 15
- రూ.5,000తో: మే 18
- రూ.10,000తో: మే 26
ఇతర ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు సవరణ: మే 09–10
- హాల్ టికెట్ డౌన్లోడ్: మే 19 నుంచి
- పరీక్ష తేదీలు: మే 28–31 (ఆన్లైన్ విధానం)
పరీక్ష విధానం:
- వ్యవధి: 2 గంటలు
- ప్రశ్నలు: 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు
- నెగటివ్ మార్కింగ్ లేదు
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు.
