విజయవాడ. ఫిబ్రవరి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ బీసీ నాయకులు ఐలాపు రం వెంకయ్య కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే విజ యవాడ పశ్చిమ నియోజ కవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ వాడ గాంధీనగర్ లోని వెంకయ్య స్వగ్రు హానికి వెళ్లి ఆయన చిత్ర పటం వద్ద శ్రద్దాంజలి ఘటించా రు. ఐలాపురం వెంకయ్య తనయుడు, మాజీ ఆర్టీఐ కమిషనర్ ఐలాపురం రాజాను, అరుణకుమార్ లను పలకరించి తమ సంతాపాన్ని ప్రకటించారు వెంకయ్య మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి నీ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పైలా సురేష్, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.

