Breaking News

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్సై అజయ్ కుమార్.

నడిగూడెం ,ఫిబ్రవరి 24 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థిని దశ నుండే సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో వారం రోజులపాటు నిర్వహించనున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ ఆలైవ్ లో భాగంగా నడిగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు మండల పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహింఛారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను ప్రమాద మరణాలను నివారించడం కోసం ముందస్తు జాగ్రత్తలు అవగాహన మార్గమని తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల ప్రమాదాల నివారణ పట్ల చుట్టుపక్కల వారిని తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని సూచించారు.

జనగణన నమోదు తోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు జనగణన సర్వే ఎంతో కీలకం : పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి

కాళేశ్వరం మరమ్మతులకు వేగం – సీఎం ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *