చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనలో మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లతో సహా దాదాపు 30-40 మంది మావోయిస్టులు కూడినట్లు సమాచారం. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి, మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ మధ్యలో, భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.
