యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారి నీ పరిశీలించారు. పరిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు. అలాగే పారిశుద్ధ కార్మికులకు మాస్కులు అందజేశారు. మాస్కులు ధరించకుండా పారిశుద్ధ పనులు చేస్తే ఆరోగ్యాలు దెబ్బతింటాయానీ పారిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు. వారి వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
