Breaking News

ఏపీ–తెలంగాణలో మారిన వాతావరణం.. మూడు రోజుల వెదర్ అలర్ట్

నేటి తెలుగు పత్రిక: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులకు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి:

ఆంధ్రప్రదేశ్

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఫిబ్రవరి 24 ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ ఎత్తులో ఉంది. ఇది తూర్పు దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర–యానాం:

  • మంగళవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు ఒకటి రెండు చోట్ల.
  • బుధవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.
  • గురువారం: సాధారణంగా పొడి వాతావరణం.

దక్షిణ కోస్తా ఆంధ్ర:

కుల అహంకారంతో పసి పాపను చంపిన నర హంతకులను ఉరి తీయాలి.
  • మంగళవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు.
  • బుధవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.
  • గురువారం: పొడి వాతావరణం.

రాయలసీమ:

  • మంగళ, బుధవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల.
  • గురువారం: పొడి వాతావరణం.

రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని సూచించారు.

తెలంగాణ

హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మరాఠ్వాడ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.

  • మంగళవారం: కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు.
  • బుధవారం: అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.
  • గురువారం: రాష్ట్రంలో ప్రధానంగా పొడి వాతావరణం.

కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

కోదాడలోవరద నివారణ చర్యలు: ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు

మొత్తానికి, వచ్చే రెండు రోజులు వర్ష ప్రభావం కొనసాగినా, మూడో రోజు నుంచి పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *