విజయవాడ. ఫిబ్రవరి 24 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర రాష్ట్రాల హక్కుల గురించి కీలక అంశాల చర్చ వేదికను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రిపబ్లిక న్ పార్టీ ఆఫ్ ఇండియా (BA) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. ఉప్పు లేటి దేవిప్రసాద్ IRS RTD పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతు భారతదేశ సమాఖ్య వ్యవస్థ (Federalism) రాష్ట్రాల హక్కుల గురించి కీలక అంశాలను ప్రస్తావించారు. ఇండియా అంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని, కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను తమకు లోకువగా మార్చుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల నుంచి వసూలు చేసిన జీఎస్టీ (GST) నిధులను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయకుండా కేంద్రమే అధికంగా వాడుకుంటోందని విమర్శించారు.అంతే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి దర్యాప్తు సంస్థల ద్వారా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
