నడిగూడెం ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): ఫిబ్రవరి 25 నుండి మార్చి18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, సాఫీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ,నడిగూడెం ఎస్ఐ జి అజయ్ కుమార్ తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మండలం లో రెండు ఇంటర్ మీడియోట్ పరీక్ష కేంద్రాల వద్ద ,25 నుండి మార్చి18 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్న వేళల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
