Breaking News

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం.

అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.
మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం
.

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక కోటి ఉచిత చీరల పంపిణీ

కోదాడ ,ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక): ​కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 186వ మంగళవారం పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, కౌన్సిలర్లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్న దేవాలయ కమిటీ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు జూకూరి అంజయ్య కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, స్థానిక కౌన్సిలర్ పద్మావతి నాగేశ్వరరావు, కౌన్సిలర్లు సుబ్బారావు, తూణం కృష్ణ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జూకూరి సంజీవ్ కుమార్,జూకూరి విజయ ,అన్నదాన నిర్వాహకులు హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, బ్యాటరీ చారి, వీరేపల్లి రామారావు ,చందా నిర్మల, వివిఎన్ఎస్ కుమార్,అనిత, పవిత్ర, పెద్ది.శేషు వి. కృష్ణమూర్తి, పోతుగంటి శ్రీనివాసరావు, ప్రసాద్ , ఆకుల పుల్లారావు, బి ఎల్ ఎన్ రెడ్డి, మోహన్ రావు,విజయరెడ్డి,వెంకటేశ్వర్లు శిరీష ,సైదులు, సత్యనారాయణ, ఉప్పలవంచు వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వెంకటకృష్ణ, విశాల్, మిశ్రా జి. పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.103 కోట్లతో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు మంజూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *