నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి మరియు యువ నటుడు నాగచైతన్య మధ్య జరిగిన భేటీ. ఇటీవల వీరిద్దరూ కలిసినట్లు బయటకు రావడంతో సినీ వర్గాల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ట్రెండింగ్లో ఉన్న ప్రముఖుల ప్రతి కదలికపై దృష్టి సారించే ఫ్యాన్స్, ఈ సమావేశాన్ని కూడా ప్రత్యేకంగా గమనిస్తున్నారు.
‘తండేల్’ సినిమాలో నాగచైతన్య నటన రాజమౌళిని ఎంతగానో ఆకట్టుకుందని, తన రాబోయే ‘వారణాసి’ ప్రాజెక్ట్లో ఒక కీలక పాత్ర కోసం ఆయన్ను సంప్రదించారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ అనంతరం నాగచైతన్యతో పూర్తి స్థాయి సినిమా చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది.మరోవైపు, ఈ ప్రాజెక్ట్ను అన్నపూర్ణ సంస్థ లేదా కార్తికేయ నిర్మించే అవకాశం ఉందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఊహాగానాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.ఇక నిజంగా రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్లో నాగచైతన్య భాగమవుతారా? లేక ఇది కేవలం సాధారణ భేటీ మాత్రమేనా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
