దళిత రత్న భూషి మహేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన దుర్మార్గమైనది ఆ గ్రామంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం దర్శనం కోసం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారని అక్కడున్నటువంటి అగ్రకుల సర్పంచ్ ఇతరులు వారిని తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సమయంలో ఆ దంపతులు ఈ పసిపాప ముఖము చూసిన దర్శనానికి పంపించమనగా మానవత్వం లేని రాక్షసులు ఆ పసిపాపను కాలితో తన్నగా రెండు నెలల పసిబిడ్డ తీవ్ర గాయాలై ఆసుపత్రిపాలై తుది శ్వాస విడిచారు. ఇంతటి దుర్మార్గమైన సమాజం ఇంకా కులమతాలు లేవు అందరూ సమానం ఇది సమ సమాజమే అనే భజన పరులకు ఈ సంఘటన ఎలా అర్థం చేసుకుంటారు. కచ్చితంగా కుల వివక్ష ఇంకా పోలేదు. కుల వివక్ష నానాటికి పెరుగుతుంది కాబట్టి ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించి దాడి చేసి పసి బిడ్డ ను చంపిన ఈ నర అంతకులను చట్ట ప్రకారము శిక్షించి బాధ్యులైన వారిని ఉరితీయాలని ఎమ్మార్పీఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
