పామర్రు, ఫిబ్రవరి 24,(నేటి తెలుగు పత్రిక ): విద్యార్థుల మేధో వికాసానికి మరియు ఉన్నత గణిత అభ్యాసానికి పునాది వంటిగా ఉండే చతుర్విధ ప్రక్రియలపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత నేటి ఉపాధ్యాయులపై ఉందని కాకినాడ ప్రాంతీయ విద్యా సంచాలకుల (RJD)జి. నాగమణి పిలుపు నిచ్చారు. పామర్రు ప్రగతి మహిళా కళాశాల లో మంగళవారం జోన్ -2 పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులకు, డైట్ ఫ్యాకల్టీలకు జరిగే రెండు రోజులు శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. గణిత మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల్లో వీటిపై అవగాహన పెంపొందించడానికి ముఖ్యమైన అంశాలు నాగమణి వివరించారు. సంకలనం, వ్యవకలనం, గుణకారం,భాగాహారం పై సమగ్రంగా ఆమె వివరించారు. సెక్షన్ లో నేర్చుకున్న అంశాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, డైట్ అంగుళూరు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఉయ్యూరు డివిజన్ విద్యాశాఖ అధికారిని పద్మరాణి, ఎంఈఓ 1 భాను ప్రకాష్, 2-గుమ్మడి పద్మవాణి, ప్రగతి కళాశాల అధినేత సనక పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
