విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మదనపల్లిలో చోటు చేసుకున్న దారుణ సంఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు సచివాలయం చాంబర్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లి దండ్రులను మంత్రి ఓదార్చినారు. ప్రభుత్వం వారి కుటుంబానికి పూర్తిస్థాయి లో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా కలెక్టర్తో మాట్లాడతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టిన చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ, క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

