విజయవాడ. ఫిబ్రవరి 24 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46 వ డివిజన్ కు చెందిన తటవర్తి కుమార్ మెదడు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నడు. అతనికి మెరుగైన వైద్యం కోసం 5,50,000/- రూపాయల ఖర్చు అవు తుందని వైద్యులు తెలి పారు. ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించారు. సమస్యను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేఖ రాసారు. దానికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందచేశారు. పశ్చిమ భవానీపురం 41 వ డివిజన్ కు చెందిన షేక్ సల్మా డిస్క్ కు సంబంధీoచిన వ్యాధితో బాధ పడుతోంది ఆమెకు మెరుగైన వైద్యం కోసం 3,25,000/_ రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్తోమత లేకపో వడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆమెకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం కోసం లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని రోగి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి నాయకుడు అవ్వారు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మహేష్ , పోతిన రాము, సుజన మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

