సంధ్యా థియేటర్ ఘటనపై హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
హైదరాబాద్: సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసును కొట్టివేయాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, శ్రీతేజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటనపై అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యజమానిపై కేసు నమోదైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది.