Breaking News

Development of 70 railway stations in Telangana

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, కాజీపేట రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

వ‌రంగ‌ల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ, మోదీ సర్కారు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌ను చేపట్టిందని వివరించారు. దేశవ్యాప్తంగా 1,300 స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు, చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణకు రికార్డు నిధుల కేటాయింపు
తెలంగాణ రాష్ట్రానికి రైల్వే నిధుల కేటాయింపును విస్తృతంగా పెంచినట్లు మంత్రి తెలిపారు. రికార్డు స్థాయిలో రూ. 5,336 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు.
తెలంగాణలో కాజీపేట రైల్వే స్టేషన్‌ సహా 70 స్టేషన్ల ఆధునీకరణ ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందని మంత్రి చెప్పారు.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర రైల్వే వ్యవస్థకు కొత్త గత్యంతరాలను తీసుకురావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *