Breaking News

పిట్టగోడ నిర్మాణం వల్ల అంతరాయం.

కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): పట్టణంలో డ్రైనేజీల మీద పిట్టగోడలు కట్టి వరద నీరు పోకుండా చేయడం వల్ల వీధుల్లో నీరు నిలబడిపోతుందనీ. డ్రైనేజీలు లక్ష్యం నెరవేరకుండా పోతుందనీ. మురికి కాల్వల్లో చెత్తాచెదారం, పేరుకుపోయిన మట్టి తీయడానికి వీలు లేకుండా డ్రైనేజీలపై గోడలు కడుతున్నారనీ. మురికి కాలువలు పూడిపోయి అపరిశుభ్రమైన మురికినీరు బజార్ల వెంట ప్రవహిస్తుందనీ. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయనీ. ఎదుటివారి ఇళ్లలోని వర్షపు నీరు, మురికి నీరు వచ్చి ఇతరుల ఇళ్ళ ముందు నిల్వ ఉండి అపరిశుభ్రతకు కారణం అవుతుందనీ. కావున మురికి కాలువలపై నిర్మించిన అక్రమ పిట్టగోడలను తొలగించి, మురికి కాల్వల లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలనీ. వెంటనే చర్యలు గైకొనాలని సామాజిక కార్యకర్త కస్తూరి రాములు, స్థానికులు కోరుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *