ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్పై సిట్ ఏర్పాటు
అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
సిట్ అధిపతిగా సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను నియమించిందని అధికారికంగా ప్రకటించింది.
ఈ దర్యాప్తు బృందంలో సీఐడీ ఎస్పీ బి. ఉమామహేశ్వర్తో పాటు మరో నలుగురు డీఎస్పీలు సభ్యులుగా ఉంటారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేషన్ బియ్యం స్మగ్లింగ్ను అడ్డుకునే చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక బృందం చర్యలు తీసుకోనుంది.
