కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక). స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ తెలిపారు.హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఉత్పత్తి రంగ కంపెనీ ఐన సూర్య టెక్ సొల్యూషన్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. సూర్య టెక్ సొల్యూషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. స్ ప్రవీణ్, మానవ వనరుల నిర్వహణ అధికారి జె. అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక లలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి నులు 14 మంది , డిప్లొమా విద్యార్థి నులు 14 మంది ఎంపిక అయ్యారు. ఎంపిక అయిన వారికి విద్యార్థినులకు వార్షిక వేతనం 4,50,000/- రూపాయలు ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు టి. స్ ప్రవీణ్ , జె. అనిల్ తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు,టీపీవో పుష్ప లత, అధ్యాపకులు అభినందించారు.
