పామర్రు, ఫిబ్రవరి 25,నేటి తెలుగు పత్రిక: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీబలోపేతానికి పార్టీ సభ్యత నమోదు ఎంతో దోహదపడుతుందని, గ్రహించి ప్రతి జన సైనికుడు వీర మహిళలు బాధ్యతగా నమోదు ప్రక్రియను ముందుకు బాధ్యతగా తీసుకెళ్లాలని పామర్రు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి తాడిశెట్టి నరేష్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ కోసం పనిచేసే వారిని ఉద్యమి, సాదక్,ప్రదాతలుగా వర్గీకరించి పార్టీ బలోపేతం కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు నరేష్ వెల్లడించారు.పక్క ప్రణాళికాలతో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గం లో ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో జనసైనికులు ప్రజలకు వివరించాలని తెలిపారు. జనసేన సభ్యత్వం రుసుము కూడా 400 రూపాయలేనని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా తో పాటు నాయకుడిగా ఎదిగే అవకాశాలు, సబ్ పార్టీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో బాధ్యతలు ఉంటాయని, పార్టీ కార్యక్రమాల్లో గుర్తింపుతో పాటు గౌరవం, ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
