Breaking News

మంగళగిరిలో శరవేగంగా పలు అభివృద్ధి పనులు

రూ. 35 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఆధునీకరణ

విద్యార్థులకు అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలు

రవాణా శాఖలో ఆటోమేషన్ – ADTT, ATSల విస్తరణ

మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలో కోకా కోలా ఇండియా వారి సీఎస్‌ఆర్ నిధులు రూ. 35 లక్షలతో పలు అంగన్వాడీ, పాఠశాలలో వివిధ రకాల అవసరాలు, అభివృద్ధి చర్యలు చేపట్టారు. అంగన్వాడీ-52, అంగన్వాడీ-53, అంగన్వాడీ-54 లను ఆధునికరించారు. అంగన్వాడీ-62 కు స్మార్ట్ టీవీ అందజేశారు. అలాగే జిల్లా పరిషత్ హైస్కూలును ఆధునీకరించి ఒక మోనిటర్, రెండు స్పీకర్లు, ఒక డెస్క్‌టాప్, 6 సీసీ కెమెరాలు, 20 జతల స్పోర్ట్స్ డ్రస్‌లు అందజేశారు. మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి ప్రజలు, స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎంపి కేశినేని ను మర్యా దపూర్వకంగా కలిసిన ఎంపి బ‌స్తిపాటి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *