విజయవాడ: ఫిబ్రవరి 25 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం కలిశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దావెంకన్న తో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఎంపి కేశినేని శివనాథ్ సాదర స్వాగతం పలికారు. ఎంపి బస్తిపాటి నాగరాజు ను ఎంపీ కేశినే ని శివనాథ్ నుశాలువాతో సన్మానించి కొండపల్లి బొమ్మ బహుకరించారు. అనంతరం వీరంతా కాసే పు మార్చి లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయా లపై మాట్లాడుకున్నారు.
