నేటి తెలుగు పత్రిక: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ తర్వాత ఇప్పుడు ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట్టారు.
Telangana Policeకి చెందిన Telangana Cyber Security Bureau మ్యూల్ అకౌంట్స్పై ప్రత్యేక దృష్టి సారించింది. 16 రాష్ట్రాల్లో నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్లో వంద మందికి పైగా సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, బ్యాంక్ ఉద్యోగులు, అకౌంట్ సప్లయర్లు ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించారు.ఇప్పుడు ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా 16 జిల్లాల్లో సోదాలు నిర్వహించి 137 బ్యాంక్ బ్రాంచ్లలో 1886 మ్యూల్ అకౌంట్స్ను గుర్తించారు. వీటికి సంబంధించి క్రైమ్ కేసులతో లింక్ ఉన్న మరో 9431 ఖాతాలను కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గతేడాది తెలంగాణ వ్యాప్తంగా 4775 మ్యూల్ అకౌంట్స్ను గుర్తించిన పోలీసులు, ఈసారి మరింత పెద్ద సైబర్ నెట్వర్క్ను ఛేదించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరో భారీ బహిర్గతం చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు
