Breaking News

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు పాల్గొన్న సీపీ గౌష్ ఆలం

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరంలోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యం లో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి సీసీ ఉపవాస దీక్షను విరమించి, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ,దాతృత్వానికి మరియు మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణ లో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో సీసీతో పాటు భీంరావు (అడిషనల్ డీసీపీ) యాదగిరిస్వామి (ఏసీపీ ట్రాఫిక్) విజయకుమార్ (ఏసీపీ రూరల్), ట్రాఫిక్ విభాగం సిబ్బంది. స్థానిక ముస్లిం సోదరులు పాల్గొని, మతసామరస్యాన్ని చాటారు.

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. మైనస్ 15 డిగ్రీల్లో కూచిపూడి నృత్యం

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *