కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరంలోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యం లో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి సీసీ ఉపవాస దీక్షను విరమించి, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ,దాతృత్వానికి మరియు మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణ లో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో సీసీతో పాటు భీంరావు (అడిషనల్ డీసీపీ) యాదగిరిస్వామి (ఏసీపీ ట్రాఫిక్) విజయకుమార్ (ఏసీపీ రూరల్), ట్రాఫిక్ విభాగం సిబ్బంది. స్థానిక ముస్లిం సోదరులు పాల్గొని, మతసామరస్యాన్ని చాటారు.
