Breaking News

వేసవి లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు.. సూర్యాపేట రోడ్డు లో మిషన్ భగీరథ పైప్ లైన్

మరమ్మత్తు పనులు పరిశీలించిన మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు.

21,22 వార్డులో దోమల మందు పిచికారి ప్రారంభం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కోదాడ ,ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): వేసవి లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కోదాడ మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. గురు వారం పట్టణం లో సూర్యాపేట రోడ్డు లో ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ మెయిన్ పైపు లైన్ కు నిర్వహిస్తున్న మరమత్తు పనులను పరిశీలించారు. నీటి ఎద్దడి రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కి సూచించారు. అనంతరం 21 వార్డు లో దోమల మందు పిచికారి ప్రారంభించారు. కోదాడ లో దోమల నివారణ కు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.వార్డు ప్రజలు పారి శుద్ధ్య నికి సహకరించాలన్నారు.22 వార్డు లో రహదారి సమస్యలు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్, తూనం కృష్ణ,నాయకులు యెర్నేని వెంకట్ రత్నం బాబు, కట్టే బోయిన శ్రీనివాస్,ధనమూర్తి ఉన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *