Breaking News

మానవతావాది కళాశాల ఫీజు చెల్లించిన ఇల్యాస్ మొహమ్మద్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి మండలం తాజ్ పూర్,గ్రామానికి చెందిన విద్యార్థిని, భువనగిరి పట్టణం లోని గాయత్రి జూనియర్ కళాశాల లొ చదువుతుంది.. ప్రస్తుతం ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్,నడుస్తున్న సందర్భంలో హాల్ టికెట్ కొరకు,కళాశాల ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణం లొ ఆపద్బాంధవుడు ఇలియాస్ మహమ్మద్ గారికి ఒక వ్యక్తి ద్వారా విషయం తెలిసిన వెంటనే తన ఇంటికి పిలిపించుకొని ఆ విద్యార్థినికి 15 వేల,రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఎగ్జామ్ రాయడానికి సాగనంపడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థిని తన కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ తన రెండు చేతులు జోడించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా బతకాలని దీవించింది..ఈ సందర్భంగా ఇల్యాస్ మహమ్మద్ మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు.

ఆర్టీసీ సమ్మెపై తలసాని తీవ్ర విమర్శలు

నారాయణపేటలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *