నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పిన్న వయస్కుడైన మునిసిపల్ కార్పోరేటర్ గోవాడ గుణచరిత్ (గుణ)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తన ఆశీస్సులు అందజేశారు.కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ (పాల్వంచ) నుంచి గుణ 22 ఏండ్ల చిన్న వయస్సులోనే రాజకీయాలలో ప్రవేశించి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గురువారం ఉదయం పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ గారిని కలిసిన సందర్భంగా గుణను పరిచయం చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ గారు గుణ భుజం తట్టి ఆశీర్వదించారు, అభినందనలు తెలిపారు.

