Breaking News

విధులు పట్ల నిర్లక్ష్యం వైఖరికి సస్పెన్షన్కు గురైన బాపులపాడు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మయ్య

మచిలీపట్నం, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక ): విదులుపట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నట్టు గుర్తించి న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ కె.లక్ష్మయ్యను సస్పెండ్ చేయ డమైనదని జిల్లా పంచాయతీ అధికారిని జే అరుణ గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,పన్నులు, నాన్-పన్నుల వసూళ్లలో కేవలం 21.8% మాత్రమే పురోగతి సాధించడం శాఖపరమైన సమీక్షా సమావేశాలకు గైర్హాజరు కావడం వంటి నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోబడ్డయన్నారు.ప్రజలకు తాగునీరు అందించే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల శుభ్రపరచడం, క్లోరినేషన్ పనుల్లో కూడా తీవ్ర నిర్లక్ష్యం చూపినట్లు గుర్తించబడింట్టు చెప్పారు.ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *