నేటి తెలుగు పత్రిక: విజయవాడలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో మా మిత్రమండలి ప్రతినిధులు మరియు రాధా రంగా మిత్రమండలి నాయకులు ముళ్ళపూడి నాగేశ్వరరావు,అల్లు రామ్మోహన్ రావు, ఆర్టీఓ శ్రీనివాస్, బడే శ్రీను, వడ్లమూడి రమేష్, టైలర్ శ్రీను, మత్తి సాంబశివరావు తదితరులు కృష్ణలంకలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి విజయవాడలో బస్టాండ్ వద్ద కంట్రోల్ రూమ్ కు ఎదురుగా వున్న ఫ్లై ఓవర్ ఎక్కేటప్పుడు ఎడమ ప్రక్కన వున్నటువంటి పార్క్ లో గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయుటకు పర్మిషను ఇవ్వవలసిందిగా వినతి పత్రం అందించారు. విజయవాడ నగర ప్రజలు చిరకాలముగా మున్సిపల్ కౌన్సిల్ ను అనేకసార్లు కోరుతున్నప్పటికి ఎప్పటికప్పుడు తదుపరి వచ్చే కౌన్సిల్లో దీని గురించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటివరకు చెప్పి, యిప్పుడు కౌన్సిల్ టైమ్ చివరకు వచ్చేటప్పుటికి కౌన్సిల్ సభ్యులలో కొంతమంది రాజకీయ కారణాల వలన ఉద్దేశ్యపూర్వకముగా ఈ తీర్మానాన్ని అడ్డుకుంటున్నారన్నా విషయాన్ని మంత్రి దృష్టికి వారు తీసుకువెళ్లారు. ఈ విషయంపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం శుభ సూచకమని మా మిత్రమండలి మరియు రాధా రంగా మిత్రమండలి ప్రతినిధులు తెలియచేశారు.


