పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పట్రా కులస్థుల సహాయ సహకారంతో వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మాణం చేపట్టి మార్చి 8 వ తేదీన ప్రారంభిస్తున్న పట్రా నాయుళ్ళ కళ్యాణ మండపం కి రాష్ట్రము లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్రా కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలి అని ఆంధ్రా ప్రదేశ్ పట్రా ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పెద్దపోతుల చిన్న ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు పెద్దపోతుల హనుమంత రాయుడు,వేముల ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ,సత్య సాయి జిల్లా అధ్యక్షులు గుజ్జు రామాంజనేయులు,మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ రాష్ట్ర నాయకు వెంకట కృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ పట్రా ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్,తలుపుల లోకేశ్వర్,నందీశ్వర, వేణు గోపాల్,చిన్న వెంగముని,గుండాలు కరపత్రాలు పంపిణీ చేసి పిలుపునిచ్చారు.గురువారం ఉదయం పులివెందుల లోని స్థానిక రంగనాయకులు స్వామి దేవస్థానం నందు వివిధ ప్రాంతాల పట్రా కులస్తులకు కరపత్రాలు పంపిణీ చేశారు.అలాగే వేంపల్లి మండలం వెలమవారిపల్లి,అశోక్ నగర్,బుగ్గ కొట్టాల,వేముల మండలం వేల్పుల,వేముల లో కరపత్రాలను పంపిణీ చేసి కులస్తులను కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఆహ్వానించి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని వారు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో సుబ్బు,రాజశేఖర్ పట్రా కులస్తులు ఉన్నారు.
