Breaking News

ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఉపశమనం.. అభియోగాల తొలగింపు.

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఊరట లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కోర్టు తొలగించినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై ఉన్న అభియోగాలను కూడా తొలగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.అధికారిక ఉత్తర్వుల ప్రతులు వెలువడాల్సి ఉండగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ‘కేరళ’ ఇకపై ‘కేరళం’

అమెరికా సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్‌ చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *