నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమె పేరును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో కవితకు క్లీన్చిట్ లభించినట్టుగా భావిస్తున్నారు.ఢల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసులో గతంలో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కోర్టు తీర్పుతో ఆమెపై ఉన్న అభియోగాలు తొలగించబడ్డాయి. ఈ పరిణామంతో కవిత అనుచరుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, కేసుకు సంబంధించిన పూర్తి తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది.
