యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. 2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.అంతకు ముందు ఆయన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమీషనర్ గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటి వరకు కలెక్టర్ గా నిర్వర్తించిన హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు. దీంతో తోటి అధికారులు అందరూ కూడా కలెక్టర్ అనురాగ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
