నేటి తెలుగు పత్రిక: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతపై స్పందించారు.శ్రీ బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకుని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.
