కల్తీ నెయ్యి అంశంపై చర్చకు ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందని ప్రశ్న.
మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటన.
అర్ధరాత్రి వరకైనా చర్చించడానికి మాకు అభ్యంతరం లేదని స్పష్టం.
వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశమని వ్యాఖ్య.
అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): కల్తీ నెయ్యి అంశంపై శాసన మండలిలో చర్చకు వైసీపీ సభ్యులు భయపడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎంతసేపైనా మాట్లాడేందుకు సిద్ధమని తెలిపారు.మండలిలో గందరగోళం నెలకొనడంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. అయితే మార్చి 4న తిరుపతి లడ్డు అంశంపై లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.శాంతిభద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, తిరుమల లడ్డూ వంటి అంశాలపై చర్చకు ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. ప్రతిపక్షం నోటీసు ఇవ్వకపోయినా సంప్రదాయాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.“వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేదే మా ఉద్దేశం. చర్చకు రాకుండా బయట దుష్ప్రచారం చేయడం సరైంది కాదు” అని మంత్రి విమర్శించారు.వైసీపీ వాకౌట్, టాకౌట్ రాజకీయాలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
