కోదాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాతృభాషా
దినోత్సవము వారోత్సవాల సందర్భముగా ప్రపంచ తెలుగు కవుల మహాసభలు జరుగుచున్నవి. ఈ కవి సమ్మేళనంలో కోదాడ ప్రాంతవాసి యువ కవిvవ్రాసిన కవిత ఉత్తమ కవితగా పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కవి సమ్మేళనము లో నవ ధూర్జటి బిరుదంకితులు తెలుగు ఎన్నారై రేడియో వ్యాఖ్యాత రవికుమార్ మాతృభాష మీద అభిమానంతో అనేక కవితలు కథలు వ్రాశారు అని అన్నారు. ముఖ్యముగా పండిత పామరులకు అర్థమయ్యే విధంగా అనేక కవితలకు రాయడం అతని సొంతం అన్నారు. తెలుగు భాష మీద మమకారంతో తన రేడియోలో అనేక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు విద్యార్థులకు గురువులకు మధ్య ఉండే అనుబంధాల గురించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం అన్నారు.భవిష్యత్తులో ప్రజాహితమైన అనేక కథలు కవితలు వ్రాయాలని విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగే విధము గా అనేక కార్యక్రమాలు నిర్వహించాలి అని అన్నారు.
