Breaking News

సి.ఆర్. మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సదస్సు ప్రారంభం.

విజయవాడ,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో “Social Media Abuse” అంశంపై అవగాహన సదస్సు జరిగింది. అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి హాజరై సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగంపై కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, డీఐజీ ఆఫ్ పోలీస్ ఆకే రవికృష్ణ, స్వేచ్ఛ – ది ఫ్రీడమ్ ఫౌండేషన్ అధినేత రవితేజ పాల్గొన్నారు .సోషల్ మీడియాలో పెరుగుతున్న దుర్వినియోగం, మహిళలు మరియు యువతపై దాని ప్రభావం, చట్టపరమైన పరిధి వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాల్సిన అవసరాన్ని వక్తలు హైలైట్ చేశారు.

ఏపీ చీఫ్ సెక్రటరీ జి.వి. సాయి ప్రసాద్‌కు శుభాకాంక్షలు.. గ్రామీణ వైద్యుల సమస్యలపై వినతి

శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *