ఫిబ్రవరి 28,నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జి వి సాయి ప్రసాద్ గారికి గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా. కొండి శెట్టి సురేష్ బాబు నేతృత్వంలో ప్రతినిధులు బ్లాక్-1 సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, గుర్తింపు, శిక్షణ, సంక్షేమ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని వినతిలో విజ్ఞప్తి చేశారు.
