కరీంనగర్, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పుష్యమి నక్షత్రం సందర్బంగా సరస్వతీ యజ్ఞం ఘనంగా నిర్వహించారు.గీకురు శ్రీనివాస్ – కృష్ణవేణి యజ్ఞం లో పాల్గొనగా శంకర్ ఆర్యన్ యజ్ఞం గావించారు. యజ్ఞం అనంతరం 6 నెలల నుండి 12 సంవత్సరముల పిల్లలకు ” సువర్ణ ప్రా శనము ” వేయడం జరిగింది. సువర్ణ ప్రాశన చిన్నపిల్లల్లో అటీజం తగ్గడం , జ్ఞాపక శక్తి పెరుగుదల ,రోగ నిరోధక శక్తి పెరగడానికి, నత్తి వంటివి తగ్గడం కోసం ఉపయోగ పడుతుందని పాఠశాల ప్రధానాచార్య సముద్రాల రాజమౌళి తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్,ఎలగందుల శ్రీనివాస్, పులల శ్యామ్, అప్పిడి వకుల దేవి తదితరులు పాల్గొన్నారు.
