విజయవాడ. ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువ చ్చేందుకు ఆకర్ష ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, IPS పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఆకర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఉచిత కౌన్సిలింగ్, డీ-అడిక్షన్ రీహాబిలిటే షన్” బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. పోలీస్ శాఖ, ఫౌండేషన్ సమన్వయం ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ముఖ్యంగా యువత గంజాయి, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, అదే సమయంలో వ్యసనపరులకు మానసిక ధైర్యాన్నిఇచ్చిమార్పు తీసుకురావడానికి ఇటువంటి సంస్థల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్ శాఖ తరపున ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్: 1972 ని అందుబాటులో ఉంచామని, ప్రజలు ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారం ఉంటే ఈ నెంబర్కు తెలపాలని కోరారు. ఆకర్ష ఫౌండేషన్ సేవలు ఆకర్ష ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గర్రె శంకర్రావు మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి కోసం ఉచితంగా కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు సహా యం కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు:
91009 79893
76004 94949
ఈ కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర, ఎస్.ఐ వీరాంజనేయులు, ఆకర్ష ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి.ఎస్. రావు, ప్రముఖ సైకాలజిస్ట్ నవిత, ఆకర్ష ఫౌండేషన్ పి.ఆర్.ఓ దేవరపల్లి మదన్ ప్రకాష్ తదితరు లు పాల్గొన్నారు..
