Breaking News

గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిల వసూళ్లను మరేంత వేగవంతం చేయాలి: డి ఎల్ డీఓ రాజేష్

పామర్రు, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): ప్రజలు నుంచి పంచాయతీలకు రావాల్సిన పన్ను బాకీ లను మరేంత వేగవంతం చేయలాని ఉయ్యూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి రాజేష్ కార్యదర్శులను ఆదేశించారు. శని వారం పామర్రు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 మార్చి 31నాటికి ఇంటిపన్నుతోపాటు, నీటిపన్ను బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధవహించి, ఎక్కడా మురుగునీరు నిల్వలేకుండా చూడాలన్నారు. సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా శానిటేషన్‌ చర్యలు చేపట్టాలన్నారు. చెత్తనుంచి సంపద కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. పారిశుధ్య కార్యక్రమాలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ సలీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు.

నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *